నిత్యం ఏదో ఓ ప్రాంతంలో ప్రేమ పేరుతో ఆడపిల్లలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమిస్తే ఒకలా మోసం చేయడం, ప్రేమించకుంటే మరోలా వేధింపులకు గురిచేయడం చేస్తున్నారు కొందరు మానవ మృగాలు. ఇప్పటికే ఎంతో మంది అమాయకపు యువతులు ప్రేమ వేధింపులకు బలయ్యారు. తాజాగా విజయనగరం జిల్లాలో కూడా ఓ యువతి ప్రేమ వేధింపులకు బలైంది.
అది విజయనగరం జిల్లా జామి మండలంలోని అంబేడ్కర్ నగర్ కాలనీ. ఇదే ప్రాంతానికి చెందిన దేవి(26), ప్రసన్నకుమార్ భార్యాభర్తలు. వీరికి గత ఐదేళ్ల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త గ్రామ విద్యా వాలంటీర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లైన కొంత కాలం ఈ దంపతులు సంతోషంగానే గడిపారు. కానీ పెళ్లై అయిదేళ్లు అవుతున్నా వీరికి ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో ఇరుగు పొరుగు వారు, అత్తింటివారు సైతం దేవిని సూటిపోటి మాటలతోనే హింసించేవారు. […]