హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సాత్విక్ మృతితో అతడి తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్రవేదనకు గురయ్యారు. సాత్విక్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. చదువుల ఒత్తిడి కారణంగా తన ప్రాణాలను తీసుకున్నాడు సాత్విక్. అయితే ఈ క్రమంలోనే నాగచైతన్య ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఇంటర్ విద్యార్థి సాత్విక్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఘటనపై తాజాగా కాలేజీ యాజమాన్యం స్పందించింది.