మన పొరుగు దేశమైన చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది చనిపోయారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. చాలామంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని.. వారికి పూర్తి సహకారమందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.