నగరంలో ఉగ్ర కదలికలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్ కావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వారు ప్రజల్లో కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. వీరిని కనిపెట్టడం ప్రజలకు చాలా కష్టమైన పని అయితే.. ఇంటెలిజెన్స్ నిఘాలో మాత్రం వీరు తప్పించుకోలేరు.