ప్రస్తుతం మానవుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించాడు. ఎప్పటికప్పుడు తన అవసరాల కోసం ఎన్నో కొత్త పరికరాలు సృష్టిస్తున్నాడు. భారత దేశంలో ఎంతో మంది యువత పెద్దగా చదువు లేకున్నా తమకు ఉన్న పరిజ్ఞానంతో అవసరాల కోసం కొత్త కొత్త పరికరాలు తయారు చేస్తున్నారు.
ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది.. మనిషి చేయలేని పని లేదంటూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నేల,నింగి,సంద్రం అన్నింటా మనిషి తన వినూత్న ప్రయోగాలతో ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా ఢిల్లీలో ఒకే మొక్కకు వంకాయ, టమాటా కాసే కొత్త విధానాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని వారణాశి కూరగాయల పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. కొత్త మొక్కను 15 రోజుల నుంచి 18 రోజుల తర్వాత భూమిలో నాటి పరీక్షించారు. తొలి దశలో వంకాయ, […]