కరీంనగర్- హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ మరియు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులకు తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎన్నికల్లో నిర్విరామంగా పని చేశారని, పార్టీ కోసం పని చేసిన సోషల్ […]
తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నాయి. ఈ రోజు రెండు స్థానాల ఓట్ల లెక్కింపు మొదలైంది. రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 359 ఓట్ల ఆధిక్యతతో ఉంది. బద్వేల్లో వైసీపీ 30412, బీజేపీ 2305, కాంగ్రెస్ 598 ఓట్లు సాధించాయి. వైసీపీ తీరుగులేని మెజార్టీతో దూసుకుపోతుంది. బద్వేల్లో వైసీపీ విజయం నల్లేరుపై నడకే అయినా.. హుజూరాబాద్లో బీజేపీ, అధికార పార్టీ టీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్లు పోటీ నడుస్తుంది.
కరీంనగర్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్కు 503 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 159 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 35 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 14 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల […]