తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నాయి. ఈ రోజు రెండు స్థానాల ఓట్ల లెక్కింపు మొదలైంది. రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 359 ఓట్ల ఆధిక్యతతో ఉంది. బద్వేల్లో వైసీపీ 30412, బీజేపీ 2305, కాంగ్రెస్ 598 ఓట్లు సాధించాయి. వైసీపీ తీరుగులేని మెజార్టీతో దూసుకుపోతుంది. బద్వేల్లో వైసీపీ విజయం నల్లేరుపై నడకే అయినా.. హుజూరాబాద్లో బీజేపీ, అధికార పార్టీ టీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్లు పోటీ నడుస్తుంది.