హిందూ మత విశ్వాసం ప్రకారం శ్రావణ మాసం, కార్తీక మాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి ఏకాదశి మొదలుకుని ఉగాది వరకు మన పండుగలు జరుపుకుంటాం. అయితే ఆషాఢం తర్వాత శ్రావణంలో శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ, మంగళ గౌరి వ్రతం,వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, శ్రీ కృష్ణాష్టమి, ప్రదోష వ్రతం మొదలైన పండుగలు చేసుకుంటాం.
శ్రావణ మాసం అంటే శ్రవణ సంబంధమైన మాసం. వెంకటేశ్వరస్వామి వారి నక్షత్రం.. శ్రవణ నక్షత్రం. స్వామివారికి అమ్మవారు నిత్యానపాయిని. భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా ఆయనను విడిచి అమ్మవారు ఉండదు. అందుకే అమ్మవారిని ‘నిత్యానపాయిని’ అంటారు.
హిందువులకు ఇది తొలి పండుగ అంటే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి. ఈ రోజు ఇల్లును శుభ్రపరుచుకొని శుద్దిగా చేసుకుని విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలిఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు సేవిస్తారు.