దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏపిలో పదివేల కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణలో సైతం కేసులు పెరిగిపోతున్నాయి. 8 నెలల తర్వాత బుధవారం రోజువారీ కేసులు మూడున్నర వేలు దాటాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే.. నిర్లక్ష్యం వహించవొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి […]
కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ అంటూ విద్యార్థుల జీవితాలు నాశనమవుతూనే ఉన్నాయి. దాదాపుగా ఏడాదిన్నరకు పైగా కరోనాతో విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. పాఠశాలల నుంచి కాలేజీల వరకు అన్ని రకాల విద్యాసంస్థలకు తాళం పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు కాస్త చదువుకు దూరమయ్యారు. ఆన్లైన్ క్లాసులంటూ మొదలుపెట్టిన వాటితో అంతాగా ప్రయోజనం లేదంటూ ఏకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొర పెట్టుకుంటున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు […]