దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏపిలో పదివేల కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణలో సైతం కేసులు పెరిగిపోతున్నాయి. 8 నెలల తర్వాత బుధవారం రోజువారీ కేసులు మూడున్నర వేలు దాటాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే.. నిర్లక్ష్యం వహించవొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతో కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు.
కేసులు పెరుగుతున్నా.. మరణాల సంఖ్య అంతగా లేవు. 90శాతం మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తుండటం ఊరటనిచ్చే అంశం. కోవిడ్ కి సంబంధి స్వల్ప లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. భయపడి ఆస్పత్రులకు పరుగు తీయొద్దని..హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటే సరిపోతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అంతే కాదు హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న వారు ఎలాంటి మందులు వాడాలో.. ఏ ఏ సమయాల్లో వాడాల్లో పూర్తి వివరాలను పేర్కొంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది.
‘‘దయచేసి గమనించండి!… ఇంటి వద్ద ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహాతో వాడాల్సిన మందులు ఇవి. ఎప్పటికప్పుడు కోవిడ్ చికిత్స మార్గదర్శకాలు అప్డేట్ అవుతుండటం వలన ఈ తాజా సమాచారం ఉపయోగించగలరు’’ అంటూ తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
దయచేసి గమనించండి!
ఇంటి వద్ద ఐసోలేశన్ లో ఉన్న కోవిడ్ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహాతో వాడవలసిన మందులు ఇవి. ఎప్పటికప్పుడు కోవిడ్ చికిత్స మార్గదర్శకాలు అప్డేట్ అవుతుండటం వలన ఈ తాజా సమాచారం ఉపయోగించగలరు 🙏#COVID19 pic.twitter.com/ykt2r0aFzT
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) January 18, 2022