నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన ఏడాదిన్నర చిన్నారి మిస్సింగ్ ఘటనలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారిని చంపింది ఎవరో కాదని, తల్లి అనూషనే అంటూ పోలీసులు తెలిపినట్లు సమాచారం. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఆదివారం నుంచి కనిపించకుండాపోయిన చిన్నారి హారిక కేసు విషాదాంతం అయింది. ఊయల నుంచి మిస్సింగ్ అయిన ఈ చిన్నారి చివరికి ఓ కాలువలో శవమై తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.