దేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే లోహాల్లో ఒకటి బంగారం. మహిళలే కాదూ పురుషులు కూడా దీనిపై మక్కువ పెంచుకుంటున్నారు. బంగారం కొనుగోలు చేయడం వల్ల లాభమే కాని నష్టం లేదని తెలివి ఎరిగి పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు.
రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అన్నీ రూ.2 వేల నోట్ల జారీని ఆపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తే జనాలు మాత్రం బంగారం షాపులకు పరిగెడుతున్నారు.