ఏం తినేటట్టు లేము, ఏం కొనేటట్టు లేము నాగులో నాగన్నా అంటూ ఓ సినిమా కవి అన్నట్లు.. ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు సగటు మనిషి. ఎటు చూసిన ధరలు పెరుగుదలే. మొన్నటి మొన్న వంట నూనె ధరలు పెరిగితే.. ఇప్పుడు సిలిండర్ ధరలు పెరిగి.. సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి.
దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వరుసగా చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దీనితోనే సతమతమవుతుంటే.. ఇప్పుడు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచింది. గ్యాస్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను అమాంతం పెంచుతూ దీపావళి షాక్ ఇచ్చారు. ఇక 19 కేజీల గ్యాస్ బండ ధరను రూ.266 […]