భారతదేశంలో ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు అని ఉంటాయని అందరికీ తెలిసిందే. సెక్యూరిటీ, నమ్మకం విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకే ఓటేస్తుంటారు. అయితే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఐసీసీఐ బ్యాంకు మాత్రం కస్టమర్స్ నుంచి నమ్మకం, భద్రతా భావం ఉన్నాయనే చెప్పచ్చు. అలాంటి ఐసీసీఐ బ్యాంకు కస్టమర్లు ప్రమాదంలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి.
బ్యాంక్ ఖాతాదారుల వివరాలు హ్యాకర్ల చేతికి చేరినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది. ఓ హ్యాకర్.. వినియోగదారులు వ్యక్తిగత వివరాలకు సంబంధించిన డేటాను డార్క్వెబ్లో పోస్టు చేయడంతోపాటు దానిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేలా చేశాడు. లీకైన డేటాలో వినియోగదారులు వ్యక్తిగత వివరాలతో పాటు రుణ సమాచారం, లావాదేవీల పద్ధతులు, క్రెడిట్ స్కోర్లు సహా పలు ఇతర వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది.