రోజురోజుకీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఇంకా దిగజారొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ల పైకి పెట్రోల్, డీజిల్ వాహనాలు రాకుండా సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశంలో కొన్ని రోజులుగా కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ అనూహ్య రీతిలో విజృంభిస్తుంది. ఈ నెల మొదటి వారంలో పదుల సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు వందలు దాటాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 600 దాటింది. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఢిల్లీలో 331 కేసులు వెలుగు చూశాయి. […]