దేశంలో నగదురహిత లావాదేవీలు భారీగా పెరిగాయ్. చెల్లింపుల విషయంలో ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా చాలానే సంస్థలు ఈ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి.
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలే జరుగుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం డిజిటల్ లావాదేవీలే కొనసాగుతున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చింది. ఇక నుంచి ప్రయాణీకుల సౌకర్యం కోసం బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు ఏర్పాటు చేయడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో దేశంలో మొదటిసారిగా ఈ నెల 15 నుంచి ఈ-పోస్ మిషన్లను ప్రవేశపెట్టనుంది. బస్సుల్లో ప్రస్తుతం టికెట్ ఇష్యూ చేస్తున్న మిషన్ల స్థానంలో ఈ-పోస్ మిషన్లు తీసుకు […]