దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలే జరుగుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం డిజిటల్ లావాదేవీలే కొనసాగుతున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చింది. ఇక నుంచి ప్రయాణీకుల సౌకర్యం కోసం బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు ఏర్పాటు చేయడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో దేశంలో మొదటిసారిగా ఈ నెల 15 నుంచి ఈ-పోస్ మిషన్లను ప్రవేశపెట్టనుంది. బస్సుల్లో ప్రస్తుతం టికెట్ ఇష్యూ చేస్తున్న మిషన్ల స్థానంలో ఈ-పోస్ మిషన్లు తీసుకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తుంది.
ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణీకులు స్పందన ప్రకారం దీన్ని మిగతా బస్సుల్లో అమలు చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మిషన్లు ఎలా వాడాలీ అన్న విషయంపై డ్రైవర్లకు, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బస్సుల్లో ఈ తరహా డిజిటల్ లావాదేవీలు పలు పెద్ద పెద్ద నగరాల్లో అమలు చేస్తున్నారు. ఏపిలో గత మూడు రోజులుగా పలు బస్సుల్లో ఈ మిషిన్లు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు..
ఇక బస్సుల్లో వాడే ఈ తరహా మిషిన్లను ఇక్సిగో-అభీబస్ సంస్థలు తయారు చేస్తున్నాయి. ఏపిలో ప్రస్తుతం ఈ మిసిన్లు 50 ఇచ్చారు. ప్రయోగం సక్సెస్ అయితే.. మరిన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మిషిన్లలో అన్ని గూగుల్, పేటీఎం, ఫోన్ పే ఇలా అన్ని రకాల పేమెంట్ సౌకర్యాలు ఉన్నాయి. నగదు చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అంతేకాదు ఈ సౌకర్యంతో చిల్లర ఇబ్బంది కూడా స్వస్తి పలకడొచ్చిన అంటున్నారు.
ఇక సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి మరో సౌలభ్యం కూడా ఏర్పాటు చేశారు.. మొబైల్ యాప్ ద్వారా బస్సులో ఖాళీలను బట్టి ‘స్టేజ్ టూ టికెట్’ ఇష్యూ విధానాన్ని కల్పించారు. డిజిటల్ లావాదేవీలే కాదు.. నగదు చెల్లించే వెసులు బాటు కూడా ఉంది. అయితే ఈ మిషిన్ ఎప్పుడూ చార్జింగ్ లో ఉండాలి. ఈ-పోస్ మిషన్ లో ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే టీమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.