రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజునే శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అమరావతి అభివృద్ధికి ఉన్న ఆటంకాలు, మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజధాని అంశం మరో మలుపు తిరిగింది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం రాజధాని అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే ఏపీ రాజధాని […]
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికి.. పోరాటాన్ని విస్తృతం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ శుక్రవారం హిందూపురం లో మౌనదీక్ష సైతం చేపట్టిన విషయం తెలిసిందే. ఇక శనివారం అఖిలపక్ష నేతలతో కలిసి.. హిందూపురంను జిల్లా కేంద్రంగా […]