జీవితంలో ఎప్పుడు ఏ విషాదం చోటుచేసుకుంటుందో తెలుసుకోలేము. ఊహించని ప్రమాదాలతో అప్పటి వరకు ఆనందంగా సాగుతున్న కుటుంబం ఒక్కసారిగా అలజడికి గురవుతుంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చిన్నవయసు వారుకూడా హార్ట్ ఎటాక్ తో అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా మన కళ్ల ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా కనిపించిన వారు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.