అమరావతి- ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రజకీయం భలే విచిత్రంగా సాగుతోంది. సొంత పార్టీ ఎంపీని ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ప్రతి పక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ను ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత […]
కర్నూలు- మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూలులో ఎన్ 440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య జనాలు భయాందోళనకు గురి అవుతున్నారని సుబ్బయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు చంద్రబాబు పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188,505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా 2005 ప్రకృతి వైపరీత్యాల […]