డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాస్ బుక్, ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఛార్జీలు ఇలా రకరకాల ఛార్జీల పేరుతో బ్యాంకులు ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. అయితే తాజాగా మరొక కొత్త రకం ఛార్జీ ఖాతాదారుల మీద పడనుంది. ఏటీఎంలో ఈ తప్పు చేస్తే కనుక ఖాతాదారుల నుంచి పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది.
ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ సెక్టార్ చాలా కీలకమైనది. ఈ సెక్టార్ లో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రముఖమైన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఈ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఏటీఎం సర్వీస్ ఛార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకు సంబంధించిన వినియోగదారులపై ఛార్జీల ప్రభావం పడే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి […]