కరోనా విపత్కర పరిస్థితిల్లో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో కష్టం. మనసుని కలిచి వేచే విషాద సంఘటనలు దేశం అంతా జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ ఇందుకు వేదిక అయ్యింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా సరైన సమయానికి అందక 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చెన్నై నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్స్ 5 నిముషాలు ఆలస్యంగా రావడంతోనే ఈ దారుణం జరిగిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు […]
కరోనా తాకిడికి సామాన్య జనాల జీవితాలు నీటి బుడగల మాదిరిగా తయారయాయ్యి. ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న వారు.., రేపటికి ఎలా ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఒకవేళ పాజిటివ్ వస్తే పట్టించుకునే నాధుడు లేక ప్రజలు అల్లాడుతున్నారు. పొరపాటున పరిస్థితి సీరియస్ అయితే హాస్పిటల్స్ లో లక్షలు కుమ్మరించాల్సి వస్తోంది. పోనీ.., ఇంతా కడితే ప్రాణాలకి గ్యారంటీ ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. బెడ్స్ దొరకడం లేదు, ఆక్సిజన్ అందటం లేదు. ప్రజలు […]
అసలే కరోనా కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ బారినపడితే ప్రాణాలతో బట్టకడతామా? అని భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇటీవలి కాలంలో చూస్తే 2009లో ఒక్కసారిగా విజృంభించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగా చెప్పవచ్చు. అప్పుడు ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతవరకు గుర్తించని కొత్త వైరస్లు, ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకేవి మహమ్మారులుగా మారతాయి. కరోనా వైరస్ ఈ కోవలోకే వస్తోంది. దీన్ని నివారించడానికి ఇంకా వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి […]
ఏపీలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి మధ్యాహ్నం 12 తర్వాత కఠినమైన ఆంక్షలు అమలుకానున్నాయి. ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజా రవాణా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్సులు, ఆటోలు, క్యాబ్లు వంటివి మధ్యాహ్నం తర్వాత నడిపేందుకు అవకాశం ఉండదు. బస్సులు తిరిగేందుకు ఆరుగంటలే సమయం. ఇప్పటికే బెంగళూరు, చెన్నైకు బస్సులు నిలిపివేయగా.. తాజాగా హైదరాబాద్కు సర్వీసులు […]
చిత్తూరు జిల్లా బేస్ చేసుకొని నడిచే అమరరాజా బ్యాటరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఆ అమరరాజా సంస్థకు చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ సంస్థకు చెందిన చిత్తూరు జిల్లాలోని ప్లాంట్లు మూసివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనేపేరుతో చిత్తూరు జిల్లాలోని ఆ కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) శుక్రవారం ఈ మేరకు […]