ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే.. బోర్డు నిర్వాహకులు అప్పుడప్పుడు చేసే నిర్వాకాల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటారు. క్వచ్చన్ పేపర్ లీక్ కావడం.. తప్పులు దొల్లడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వెంటనే సర్ధబాటు చేసుకొని పరీక్షలు వాయిదా వేయడమో..మార్కులు కలపడమో లాంటివి చేస్తుంటారు.