‘ఆదిపురుష్’ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పారు. ‘ఆదిపురుష్’ చిత్రంతో బాధించినందుకు దేశ ప్రజలకు సారీ చెప్తూ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టారాయన.
రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసి చివరకు విమర్శలపాలయ్యారు. సినిమాలోని పాత్రలు, డైలాగులు సరిగా లేవంటూ ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. తాజాగా రైటర్ మనోజ్ ముంతాషిర్ హనుమంతుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఆంజనేయుడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.