చదువుపూర్తై ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్నారా? అయితే మీకు ఇది ఒక సువర్ణావకాశం. పదో తరగతి అర్హతతో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనందించింది. పోస్టల్ శాఖలో భారీగా నియామకాలను చేపట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. తాజాగా పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 30041 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఉద్యోగాలను పొందొచ్చు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఇప్పటికే పోస్టల్ శాఖ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. నేటి నుంచి అనగా 03/08/2023 నుంచి 23/08/2023 తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో కోరింది. ఆగస్ట్ 24 నుంచి 26 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్ లో దొర్లిన తప్పొప్పులను సవరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి.. రోజువారీ కార్యకలాపాల కోసం ల్యాప్టాప్/ స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ డిపార్ట్ మెంట్ అందిస్తుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఆఫీస్ కు అందుబాటులో నివాసం ఉండాలి. మరిన్ని వివరాలో కోసం పోస్టల్ శాఖ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.