టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ క్రైం కూడా పెరిగిపోతున్నది. అపరిచిత కాల్స్ ద్వారా, టెక్ట్స్ మెసేజెస్ ద్వారా వ్యక్తులను లేదా సంస్థలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లో గిఫ్టుల పేరుతో కూడా ఛీటింగ్ చేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఇప్పుడు ఇంకో కొత్త రకం మోసం బయటపడింది. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలకు లైకులు కొడితే చాలు అని సైబర్ నేరగాళ్లు నమ్మబలికి డబ్బు దోచుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.