బెంగళూరు- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనవరాలు సౌందర్య మృతి సంచలనం రేపుతోంది. శుక్రవారం బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్లో ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. సౌందర్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం యాడియూరప్ప పెద్ద కూతురు పద్మ కుమార్తె సౌందర్య. ఆమె వయసు 30 సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితం ఆమెకు వివాహమైంది. డాక్టర్ నీరజ్తో ఆమెకు పెళ్లి జరగ్గా, వారికి నాలుగు నెలల పాప కూడా ఉంది. […]