బెంగళూరు- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనవరాలు సౌందర్య మృతి సంచలనం రేపుతోంది. శుక్రవారం బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్లో ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. సౌందర్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
కర్ణాటక మాజీ సీఎం యాడియూరప్ప పెద్ద కూతురు పద్మ కుమార్తె సౌందర్య. ఆమె వయసు 30 సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితం ఆమెకు వివాహమైంది. డాక్టర్ నీరజ్తో ఆమెకు పెళ్లి జరగ్గా, వారికి నాలుగు నెలల పాప కూడా ఉంది.
వృతిరిత్యా సౌందర్య డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆమె పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సౌందర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు రిజస్టర్ చేసుకున్నారు.
సౌందర్య మృతదేహాన్ని బెంగళూరు ఉత్తర అబ్బిగెరె నీరజ్ఫామ్ హౌజ్కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సౌందర్య మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు యడియూరప్ప కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.