ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ సంబరాల సదర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచా ఘోర ప్రమాదానికి దారి తీసింది. బాణసంచా కారణంగా గుడిసెలో లో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా.. పదికి పైగా మందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.