రాక.. రాక వచ్సిన అవకాశం.. ఇప్పుడిప్పుడే జట్టులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో అమ్మవారి ఆశీస్సులు ఉంటే మరింత మంచి ప్రదర్శన చేసే అవకాశం లేకపోలేదు. ఆ నమ్మకంతోనే భారత క్రికెటర్, టెస్టు టీమ్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ సతీసమేతంగా విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. భార్య అంజలితో శారదా పీఠానికి విచ్చేసిన అతడు రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.