కాకినాడ జిల్లా వలసపాక కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ దాదాపు 40 మంది విద్యార్ధుల వరకు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరందరిని వలసపాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిన్న టీచర్స్ డే సందర్భంగా కేకు తిన్నట్లు కొంతమంది విద్యార్ధులు చెబుతున్నారు. అయితే కేవలం కేకు వలనే ఇంతమంది విద్యార్ధులు అస్వస్థత గురికావడం జరగదని స్థానికులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చుట్టు కూడా కాలుష్యాన్ని వదిలే కంపెనీలు ఉంటాయి. […]