ఇటీవల దేశంలో పలు చోట్ల బీభత్సమైన వర్షాలు పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల రాళ్ల వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. వడగళ్ళ వానకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పంట నష్టంతో విల విలాడిపోతున్నారు. కొన్ని చోట్లు పిడుగు పాటుకు పశువులు కూడా మరణించాయి.
గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇక్కడ పలుమార్లు భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య భారత్ లో సైతం వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి.