భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వాహనాలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. చాలాచోట్ల వరదలతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగి వాహనాలపై పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఉత్తరాఖండ్- దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జలవిలయానికి మొత్తం 42 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారులన్నీ మూసుకుపోయాయి. నదులపై ఒకటి రెండు చోట్ల వంతెనలు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సహాయక చర్యలకోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. నైనిటాల్ నగరానికి దారితీసే మూడు […]