హుజూర్ నగర్ లో కొన్ని రోజుల క్రితం అధికారులు ఇందిరా గాంధీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా.. టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2021, డిసెంబర్ 24 నుంచి హుజూర్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. విగ్రహాలను పునః ప్రతిష్టించేంత వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విగ్రహాలు పెట్టేదాక […]
హైదరాబాద్- ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల కనీస, ప్రాథమిక బాధ్యత అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరోనాతో చికిత్స పొందుతున్న ఉత్తమ్ ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపించారు. కరోనాను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని,పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. […]