టైటాన్ గల్లంతైన విషయం ప్రపంచం మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అందరు టైటాన్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉదంతం విషాదాంతం మిగిల్చింది. అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ షిప్ శకలాలను గుర్తించడానికి.. టైటాన్ మినీజలాంగర్గామిలో బయలుదేరిన ఐదుగురు చనిపోయారని అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.