భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. నష్టం వచ్చినా ఎంత కష్టమైనా రైతులు వ్యవసాయం చేయడం మాత్రం మానుకోరు. భారతదేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంటలు పండించి దేశ ప్రజల ఆకలిని తీరుస్తున్నారు.