తిరుమల- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో టీటీడీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో ప్రకటించిన మేరకు తిరుమలలో భక్తుల కోసం సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఇది శ్రీవారి భక్తులకు అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ పద్దతిలో పండించిన ఉత్పత్తులతో అన్నప్రసాదాలను తయారు చేస్తోంది టీటీడీ. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ముందు మీడియా ప్రతినిధులకు, టీటీడీ […]