విశాఖపట్నం- తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి ఇక లేరు. ఆయన ఈ తెల్లవారు జామున హఠన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం గుండపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపు కన్నుమూశారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటును […]