కరోనా ఉద్ధృతి వల్ల వేసవిలో రావాల్సిన పలు చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. దీంతో సినీ ప్రియులకు వినోదాల్ని అందించే బాధ్యతను ఓటీటీలు మరోమారు అందిపుచ్చుకున్నాయి. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా అనసూయ నటించిన ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రం విడుదలైంది. ఇప్పుడీ బాటలోనే దాదాపు అరడజను వరకు చిన్న సినిమాలు సిద్ధమయ్యాయి. ఇటీవలే ‘లెవెన్త్ అవర్’ వెబ్ సిరీస్తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి తమన్నా. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘నవంబర్ స్టోరీ’తో ప్రేక్షకుల్ని […]