ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన 40 అంతస్థుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు మాసాల్లో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. అలహాబాద్ హైకోర్టు 2017లో ఈ అక్రమాల్ని నిర్ధారించి కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ బిల్డర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ వాదనల తర్వాత టవర్స్ కూల్చివేతపై […]