మొబైల్ వినియోగదారులకు టెలికాం సంస్థ ఎయిర్టెల్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కనీస రీఛార్జి మొత్తాన్ని గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేసిన ఎయిర్టెల్ మరోసారి రీఛార్జ్ ధరల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు భారతీ ఎయిర్టెల్ సీఈవో సునీల్ మిత్తల్ సంకేతాలు పంపారు.