కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావ్పల్లి సర్పంచ్కు కరోనా టెస్టు చేస్తుండగా స్వాబ్ స్టిక్ (టెస్ట్ చేసే పుల్ల) విరిగి ముక్కులో ఇరుక్కుపోయింది. సిబ్బంది బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ రాలేదు. వెంటనే కరీంనగర్ తరలించగా అక్కడి డాక్టర్ ఎండోస్కోపి ద్వారా బయటికి తీశారు. గోపాల్రావుపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రారంభానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ జవ్వాజి శేఖర్ హాజరయ్యారు. తొలి పరీక్షను ఆయనకే నిర్వహించారు. […]