హిందువులకు ఇది తొలి పండుగ అంటే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి. ఈ రోజు ఇల్లును శుభ్రపరుచుకొని శుద్దిగా చేసుకుని విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలిఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు సేవిస్తారు.