విజయవాడలోని పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న పురాతన ఆలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఇందులో కనకదుర్గ రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు. కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా ఆమె ప్రసిద్ధి. అందుకే కోర్కెలు తీరిన వెంటనే ఆమెకు కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు.