హైదరాబాద్ క్రైం- హైదరాబాద్ మాదాపూర్ లో ఓ మహిళపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే, మరో ఘోరం జరిగింది. నగరంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ ఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లిలో చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి దూబేకాలనీకి చెందిన వెంకటాచారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కార్పెంటర్గా పనిచేసేవాడు. అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా సోకడంతో ఏడాదిన్నర క్రితం మరణించాడు. పెద్ద కుమార్తెకు పెళ్లికావడంతో మొయినాబాద్ లో ఉంటోంది. […]