మానవ మేథస్సు, సృజనాత్మకత కలగలసిన నిర్మాణాలు, సహజసిద్ధంగా ఏర్పడినవి, మన సాంస్కృతిక మూలాలకు ప్రతిరూపంగా ఉండేవి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందుతాయి. ఈ నేపధ్యంలో సింహగిరి వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోని శిల్పాలు, శాసనాలకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు. సంబంధిత ప్రదేశానికి చారిత్రక ప్రాముఖ్యం ఉందనే విషయం తెలియగానే దాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. యుద్ధంలాంటి సమయాలలో ఈ వారసత్వ సంపదల జోలికి […]