ప్రస్తుతం ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజల సామాజిక, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. వారిలో అలసత్వమూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది కరోనా మొదటి ఉద్ధృతిలో ప్రయాణాలు, పండుగల సమయంలో గుమిగూడటాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా ఈ ఏడాది మార్చిలో రెండో ఉద్ధృతి మొదలైంది. రెండో ఉద్ధృతి వల్ల దేశ ప్రజల్లో సహజసిద్ధ రోగ నిరోధక శక్తి భారీగా పెరిగింది. ఇది మూడో విజృంభణ ప్రభావాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి గత […]