మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రిగా బాధ్యత గల పదవిలో వుండి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని.. నేతల స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అన్న దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటూ సీఎంఓ హెచ్చరించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇదిలావుంటే ఈ విషయపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మంత్రి సీదిరి అప్పలరాజును మందలించినట్లు తెలుస్తోంది.