పన్ను ఎగవేస్తూ హైదరాబాద్లో యథేచ్ఛగా తిరుగుతున్న లగ్జరీ కార్ల యజమానులపై దృష్టి సారించిన రవాణాశాఖ రవాణాశాఖ కొరడా విసిరింది. అక్రమంగా తిరుగుతున్న 11 ఖరీదైన కార్లను సీజ్ చేసింది. ఈ క్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు నేతృత్వంలో చర్యలకు ఉపక్రమించారు. 40 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు, మోటర్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేస్తున్న కార్ల యజమానులను గుర్తించేందుకు రవాణాశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. […]