ఒలింపిక్స్లో భారత్కు రెండు సార్లు పతకాలు అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్కుమార్పై హత్య, హత్యాయత్నం, దౌర్జన్యం వంటి అభియోగాలు నమోదు అయ్యాయి. జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగాలను సుశీల్పై నమోదు చేసింది. దీంతో సుశీల్ను దేశంలోనే అత్యంత దుర్భేద్యమైన తీహార్ జైలుకు తరలించారు. సుశీల్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 17పై కూడా అభియోగాలు మోపారు. అందులో ఇద్దరు పరారీలో ఉండగా వారిని కూడా […]